ఏపీలో టీడీపీకి ఎన్ని సీట్లంటే? మాజీ మంత్రి జోస్యం..!

545చూసినవారు
ఏపీలో టీడీపీకి ఎన్ని సీట్లంటే? మాజీ మంత్రి జోస్యం..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఫలితాలపైనే నెలకొంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని పార్టీల్లోనూ ఆశలు రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫలితాలపై తనదైన రీతిలో జోస్యం చెప్పారు.టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అని, 135 సీట్లతో టీడీపీ గెలవబోతుందని సోమిరెడ్డి తెలిపారు. కడపలో కూడా వైసీపీ ఓడిపోబోతుందన్నారు.

సంబంధిత పోస్ట్