14 మంది విద్యార్థులకు అస్వస్థత

8939చూసినవారు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని 14 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని తల్లిదండ్రులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్