కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. నియోజకర్గంలో వైసీపీకి చెందిన ముఖ్యనేత షేక్ మౌలాలి టీడీపీలో చేరారు. మౌలాలితో పాటు ఆయన అనుచరులకు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. "నాని పచ్చి మోసగాడు. అవసరం తీరాక వదిలేస్తాడని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు." అని విమర్శించారు.