నిషేధిత గుట్కాలను అక్రమంగా తరలిస్తున్నా ద్విచక్ర వాహనదారుడిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్ల నుంచి నేరేడుచర్ల కు తరలిస్తున్న రూ. 50 వేలు విలువైన గుట్కాను గుర్తించి పట్టుకున్నారు. గుట్కాలతో పాటు వాహనాన్ని సీజ్ చేసి నిందితుడు పై కేసు నమోదు చేసినట్లు మట్టంపల్లి ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు