భళా సూక్ష్మ కళ.. సుద్ద ముక్కపై చత్రపతి శివాజీ ప్రతిమ

79చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు బుధవారం భరతమాత వీరుడు ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై శివాజీ ప్రతిమను చెక్కి ఆయనపై తనకు ఉన్న దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు , పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్