కోదాడ అంబేద్కర్ కాలనీకి చెందిన జిల్లపల్లి నాగేశ్వరరావు కుఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ప్రధానం చేసింది. నాగేశ్వరరావు ఓయులో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. డాక్టరేట్ సాధించాలనే ఉన్నత ఆశయంతో పిహెచ్ డిలో ప్రవేశం పొంది ప్రొఫెసర్ డాక్టర్. వి.బి నరసింహా పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలకు ఓయూ అధికారులు డాక్టరేట్ అవార్డు అందజేశారు.