మాదిగల దండోరా రజితోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

74చూసినవారు
మాదిగల దండోరా రజితోత్సవాల కరపత్రం ఆవిష్కరణ
జులై 7న జరిగే మాదిగల దండోరా ఆవిర్భావ రజితోత్సవాలను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు మాదిగ అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చింతబాబు మాట్లాడుతూ.. ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులైయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, కోదాడ మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్