వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో నిరసన

2279చూసినవారు
వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో నిరసన
ఐటి శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కోదాడ మునిసిపల్ కార్యాలయం ముందు శనివారం కాంగెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముజాడ రామారావు, లక్ష్మణ్, అబ్దుల్, వీరమ్మ, రాజేష్, కాంతారావు, రఫీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్