కోదాడ పట్టణానికి చెందిన బిఎస్ఎన్ఎల్ శాఖ విశ్రాంత ఉద్యోగి గోమవరపు వెంకటాచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ లో క్యాజువల్ లేబర్ గా చేరిన ఆయన పదోన్నతులు పొంది జూనియర్ టెలికం ఇంజనీర్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు భార్య కూతురు కుమారుడు ఉన్నారు. చారి మృతి పట్ల విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అనంతోజు కృష్ణయ్య, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంతాపం వ్యక్తం చేశారు.