కేశవాపురంలో మాజీ పీసీసీ సభ్యురాలు మృతి
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని కేశవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ సభ్యురాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా సమైక్య మాజీ జనరల్ సెక్రెటరీ గొబ్బి మేరమ్మ బుధవారం మృతి చెందారు. ఈ సందర్భంగా వారికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మండలంలోని పొదుపు సంఘాల్లో పేద మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై రాజీలేని పోరాటం చేశారని తెలిపారు.