సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు, గాలి వానలు విపరీతంగా వీచాయి. స్థానిక జనగాం క్రాస్ రోడ్ సమీపంలోని దుర్గాభవాని హోటల్ వెనుక తాటిచెట్టు పై పిడుగు పడింది. తాటి చెట్టు పై పిడుగు పడటంతో తాటి చెట్టు కాలి బూడిదైపోయింది. ఇలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.