పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా జేష్ట మాసం సోమవారం పూజలు

58చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చరిత్రత్మక 12వ శతాబ్దానికి చెందిన శ్రీమహాదేవ నామేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు జేష్ఠ మాసం మొదటి సోమవారం మహా పర్వదిన సందర్భంగా బ్రహ్మ సూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో ఈశ్వరుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్