సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో అక్రమ సంబంధానికి పసిపాప బలైపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన నవ్యశ్రీ కి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. నవ్య శ్రీ అక్రమ సంబంధం పెట్టుకున్న అరవింద్ రెడ్డి ఈనెల 11న నిద్రిస్తున్న పాపను కిరాతకంగా దాడి చేసి చంపాడు.