యూపీలోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. దీంతో తమకు సరిగ్గా పని దొరకడం లేదని, వ్యాపారాలు నడవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అయితే అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడమూ భక్తుల రద్దీ తగ్గడానికి, వ్యాపారాలు మందగించడానికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.