తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సంఘటన మంగళవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం శ్రీ సీతారామ చంద్ర స్వామీ దేవస్థానం ఆవరణలో గుప్త నిధుల తవ్వకాల నిమిత్తం కొంత మంది ఉదయం 11 గంటలకు తవ్వకాలు మొదలు పెట్టే సమయానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.