టెల్ అవీవ్‌కు విమానాల నిలిపివేత

84చూసినవారు
టెల్ అవీవ్‌కు విమానాల నిలిపివేత
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తాము తిరిగి మళ్లీ ప్రకటించేంత వరకు ఎలాంటి విమానాలు నడవవని వెల్లడించింది. కాగా తమ దేశంలోని ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్