మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ కదలిక లోపాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మెదడువాపు వ్యాధి రోగులకు న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో వైద్యం అందించబడుతుంది. కొన్ని రకాల వైరస్లకు మాత్రమే యాంటీ వైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మూర్ఛ నివారణ మందులు, నాడీ కణాల్లో వాపు తగ్గించేందుకు వాడే మందులను రోగులకు అందిస్తుంటారు.