టీమిండియా టీ20 ప్రపంచకప్ను రెండోసారి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యూపీ పోలీసులు భారత జట్టును అభినందిస్తూ తమ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.