టీ20 వరల్డ్ కప్లో పాక్తో న్యూయార్క్లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో భారత్ గెలిచింది. 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యం అయినప్పటికీ ఛేదనలో పాక్ తడబడింది. 20 ఓవర్లలో 113/7 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో బుమ్రా 3, హార్దిక్ 2 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు.