తిరుమల శ్రీవారి ఆలయ క్యూలైన్లో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ ప్రాంక్ వీడియోలు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో భక్తులకు వాసన్ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. "భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తుండగా తోటి మిత్రుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయి. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం" అని వాసన్ పేర్కొన్నారు.