ఓ యూనివర్సిటీ పరీక్షలను ఇవాల్యుయేషన్ చేసే సమయంలో.. బిహార్కు చెందిన ఒక టీచర్ రీల్స్ చేసింది. ఇలా చేయడమే పెద్ద తప్పయితే, అంతకుమించి మరో పెద్ద తప్పు చేసింది.
విద్యార్థులు రాసిన ఆన్సర్లను ఏమాత్రం గమనించకుండానే.. రైట్ మార్క్ వేస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. వివాదాస్పదంగా మారాయి. ఈ రీల్స్పై నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.