ఛత్తీస్ఘడ్లో ఇటీవల మావోల ఏరివేత ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా గిర్సపార అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమరుస్తున్న 15 మంది మావోయిస్టులను డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరి వద్ద నుంచి ఒక మందు పాతర, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్, ఒక టిఫిన్ బాక్స్ మావోయిస్ట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.