నాసిక్ జిల్లా కలెక్టర్ హత్య చేయించారనే ఆరోపణలతో 1910లో బ్రిటిష్ అధికారులు లండన్లో సావర్కర్ను అరెస్టు చేశారు. కలెక్టర్ హత్యకు ఉపయోగించిన పిస్టల్ ను లండన్ నుంచి తన సోదరుడికి సావర్కర్ పంపారని ఆరోపణలు వచ్చాయి. 'ఎస్ఎస్ మౌర్య' అనే నౌకలో సావర్కర్ను
భారత్ తీసుకొస్తున్న సమయంలో ఆ నౌక ఫ్రాన్స్లోని మార్సెలీ రేవు దగ్గర ఆగినపుడు సావర్కర్ టాయిలెట్లోని పోర్ట్ హోల్ నుంచి సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు.