బ్యాంక్‌లో సాంకేతిక లోపం.. రూ.350 కోట్లు ఖాళీ

63చూసినవారు
బ్యాంక్‌లో సాంకేతిక లోపం.. రూ.350 కోట్లు ఖాళీ
సాంకేతిక లోపం.. ఓ బ్యాంకుపాలిట శాపంగా మారింది. తమ ఖాతాల్లోని నగదు కంటే ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసేందుకు వినియోగదారులకు అవకాశం లభించడంతో.. వారంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. బ్యాంకు నుంచి ఏకంగా రూ.350 కోట్ల మేర ఖాళీ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన ‘కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇథియోపియా’లో ఇది చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్