ఏపీపీఎస్సీ జారీచేసిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్ని సార్లు వివరాలను నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ వస్తోందని చెబుతున్నారు. గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ అతి త్వరలో గడువు ముగియనున్న నేపథ్యంలో నెట్బ్యాకింగ్తో పాటు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని కోరుతున్నారు.