రైతులు మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. మల్లె తోట సాగు చేపట్టిన మూడో సంవత్సరం నుండి దాదాపుగా 15 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. కోమ్మ కత్తిరింపులు జరిపిన తర్వాత పది రోజులకు నీటి తడిని అందించాలి. నేలలోని తేమశాతాన్ని బట్టి ఐదు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి. కొమ్మల కత్తిరింపులు తర్వాత పశువుల ఎరువు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.