తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల - జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతుల కూతురు సాయిషుమా(19)సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది. దీంతో తరచూ సెల్ ఫోన్
పాడు చేస్తున్నావని తల్లి మందలించి,
తర్వాత చేయిస్తామని చెప్పింది. అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే చెయ్యరు అంటూ తల్లిదం
డ్రులు పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.