ఏపీలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థను నెలకొల్పాలని
వైసీపీ ప్రభుత్వం యోచిస్తొంది. ఈ మేరకు టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపినట్లు, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న టెస్లా అధిపతి ఎలాన్ మస్క్.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేజిక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.