హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణలో గ్లోబల్ రైస్ సమ్మిట్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో క్రమంగా వరి ఉత్పత్తి పెరుగుతోందని పేర్కొన్నారు.