కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకురావాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ ఏజెన్సీలు యువతను మోసగించాయని ఆరోపించారు. బాధితులను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.