హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో తన విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని తెలిపారు ‘‘తెలంగాణ గడ్డపై తెదేపాకు పునర్వైభవం వస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ.. కార్యకర్తలు వెళ్లలేదు’’ అని చంద్రబాబు తెలిపారు.