గ్లోబల్ ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారు. టెస్లా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండియాలో అనువైన ప్రాంతాన్ని వెతుకుతుంది. ఈ నెలలోనే అమెరికా నుంచి టెస్లా బృందం ఇండియాకు రానుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఏర్పాటైన ఆటోమోటివ్ హబ్లతో ఈ బృందం ప్లాంట్ కోసం స్థలాన్ని గుర్తించనుంది. ఈ ప్లాంటు విలువ సుమారు రూ.25 వేల కోట్లు.