టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విజయంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడారు. 'టీ20 ట్రోఫీని పట్టుకొని సంబరాలు చేసుకోవటం కోసం రాహుల్ ద్రవిడ్ని కోహ్లీ పిలిచారు. ట్రోఫీ అందుకున్న తర్వాత ద్రవిడ్ ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో గట్టిగా అరిచి కప్ని కౌగిలించుకొని కన్నీరుపెట్టుకున్నారు. నా వరకైతే టీ20 ప్రపంచకప్లో ఇదే బెస్ట్ మూమెంట్' అని పేర్కొన్నారు.