మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణికులతో నిండిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పడవలో దాదాపు 11 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాలని అధికారులను కోరారు.