రాష్ట్రంలో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 55 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.