పాకిస్థాన్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి పీఓకేలోని పల్లంద్రికి వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పింది. కహుటా సమీపంలో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు చనిపోయారు. బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పంజాబ్ సీఎం మరియమ్ నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంతాపం తెలిపారు.