సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ కాల్పులు

71చూసినవారు
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ కాల్పులు
మరోసారి జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం పూంచ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు ఎగిరాయి. ఆర్మీ దళాలు వాటిని గుర్తించి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. మెంధార్‌లోని బల్నోయి, గుల్పూర్ సెక్టార్స్‌పై పాక్ డ్రోన్లు కొద్దిసేపు ఎగిరాయని చెప్పారు. సైనికుల కాల్పుల తర్వాత ఆ డ్రోన్లు పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్