స్వీకర్ రిహాబిలిటేషన్ లో సరోజిని నాయుడు జయంతి వేడుకలు

66చూసినవారు
స్వీకర్ రిహాబిలిటేషన్ లో సరోజిని నాయుడు జయంతి వేడుకలు
సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు సుధాకర్ గాందె గారి అధ్వర్యంలో సికింద్రాబాద్ లోని స్వీకర్ రిహాబిలిటేషన్ లో వేడుకలు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, శ్రీ సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని స్వీకర్ రిహాబిలిటేషన్ విద్యార్థులతో కలిసి వేడుకలను నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు సుధాకర్ గాందె గారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించడమంటే మహిళా శక్తిని ప్రోత్సహించడమేనన్నారు. వారు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. ఇక్కడకు వచ్చిన అందరూ నారీ శక్తి సాధికారతకు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. వారి సాధికారతకు పెద్దపీట వేస్తుందన్నారు. గత 10 ఏళ్లలో మహిళా శక్తిని అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు మన మోడీ ప్రభుత్వం విశేషంగా పని చేస్తుందన్నారు. అనంతరం ఈ వేడుకల్లో వక్తలు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు గారు, Dr. మార్కండేయ గారు, భాస్కర్ రావు గారు మరియు రిహాబిటేషన్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్