పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే తండ్రి ఖననం చేశాడు. పోలీసులు నిందితుడిని తయ్యబ్గా గుర్తించారు. బిడ్డ ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెతికి తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు.