క్రికెట్ అభిమానులను ఏడాదికి రెండు నెలల పాటు అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ప్రస్తుతం 17వ సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ మొదటి సీజన్ ఆరంభమైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఆనాటి మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికైంది.