ఈతకు వెళ్లి ముగ్గురు మైనర్ బాలురు మృతి (వీడియో)

1060చూసినవారు
ఢిల్లీలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సమీపంలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మునక్ కెనాల్‌లో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం చాలాసేపు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. యువకులను అంకిత్ (15), రిహాన్ (14), అయాన్ (13)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో యువకుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్