లోక్సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. 1,717 మంది అభ్యర్థులు సోమవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 45 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్పుర్లో నలుగురు బరిలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోని 42 స్థానాలకూ ఈ దశలోనే పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.