రూ.2వేలు పందెం కాసి.. మున్నేరు వాగులో మునిగి యువకుడు మృతి

84చూసినవారు
రూ.2వేలు పందెం కాసి.. మున్నేరు వాగులో మునిగి యువకుడు మృతి
ఉధృతంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగులో దూకి యువకుడు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ప్రవాహంలో ఈదుతూ ఈ వాగును దాటాలని గోపిచంద్, రోశయ్య అనే ఇద్దరు యువకులు రూ.2వేలు పందెం వేసుకున్నారు. దీంతో నందిగామ పెద్ద బ్రిడ్జి పై నుంచి వీరిద్దరూ దూకారని పోలీసులు తెలిపారు. అయితే రోశయ్య అనే వ్యక్తి ఒడ్డుకు చేరగా, గోపిచంద్ నీళ్లలో గల్లంతయి మృతి చెందాడని చెప్పారు. 2 గంటలపాటు గాలించి గోపిచంద్ మృతదేహాన్ని గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్