తమిళనాడుకు చెందిన వైద్యులు అద్భుతం చేశారు. కుంభకోణానికి చెందిన 14 ఏళ్ల బాలిక దుస్తులు వేసుకుంటూ పొరపాటున సూది మింగింది. వెంటనే తల్లిదండ్రులు తంజావూరులోని శ్రీకామాక్షి మెడికల్ సెంటర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ సూది ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ అరుణ్ నేతృత్వంలోని బృందం.. ఎలాంటి సర్జరీ లేకుండా బ్రాంకోస్కొపీ ద్వారా కేవలం 3.23 నిమిషాల్లో ఆ సూదిని తొలగించింది.