నిజామాబాద్ జిల్లాలో కన్నీళ్ళు పెట్టించే ఘటన చోటుచేసుకుంది. మిట్టాపల్లి గ్రామానికి చెందిన మాసిపెద్ది ప్రశాంత్ (29) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించినా జాబ్ రాలేదు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఓ యువతితో తనకి పెళ్లి సంబంధం కుదిర్చారు. శనివారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే జాబ్ లేని తను పెళ్లైతే భార్యను చూసుకోవడం భారం అవుతుందని భావించాడు. ఈ మేరకు గురువారం స్నేహితుడికి ఫోన్ లో ఈ విషయం చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.