శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్

55చూసినవారు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయిక ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్