ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ సంఘటన జరిగింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న గోవింద్ మోతీ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న తన భార్య మంజును అనుమానంతో హత్య చేశాడు. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గోవింద్ను అరెస్ట్ చేశారు. కాగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.