వినాయక పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణమిదే!

78చూసినవారు
వినాయక పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణమిదే!
వినాయక చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పురోహితులు చెబుతున్నారు. గరికలోని ఔషధ గుణాలు ఉంటాయి. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని సృష్టించి దేవతలను ఇబ్బంది పెట్టాడు. ఆ గణేశుడు రాక్షసుడిని మింగడంతో.. ఆయన శరీరం వేడిగా మారిందని పురోహితులు చెబుతున్నారు. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామివారి శిరస్సుపై ఉంచగా తాపం తగ్గింది. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యత లభించిందని పురోహితులు చెబుతారు.

సంబంధిత పోస్ట్