యూపీలోని కాన్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతికి జనవరిలో లఖింపూర్ ఖేరీకి చెందిన యువకుడితో వివాహమైంది. యువతి పేరెంట్స్ వరుడికి రూ. 20 లక్షలు కట్నంగా ఇచ్చారు. పెళ్ళైన రోజు నుంచే భార్యను దూరం పెట్టాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కాలేదు. తాజాగా అతని ఫోన్ని సెర్చ్ చేయగా స్వలింగ సంపర్కుడని తెలిసింది. అతను ఎవరో మగ వ్యక్తితో అక్రమ సంబంధంలో ఉన్నాడని తెలుసుకుని షాకైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.