భారీ వర్షంతో కొండ కూలి.. 9 మంది మృతి

570చూసినవారు
భారీ వర్షంతో కొండ కూలి.. 9 మంది మృతి
కర్ణాటక రాష్ట్రం అంకోలా తాలూకాలోని శిరూరు జాతీయ రహదారి పక్కన భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం 9 మంది చనిపోయారు. జాతీయ రహదారి 66లో IRB కంపెనీ హైవే విస్తరణ కోసం రోడ్డు పక్కన ఉన్న కొండను భారీ స్థాయిలో తవ్వింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ కొండ భారీగా కుప్పకూలింది. NDRF బృందం ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్